Kodali Nani: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిని టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరన్నారు. రుషికొండ లోని భవనలు జగన్ నివాశాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kodali Nani: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చెయడని జగన్ అన్నారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ సిక్స్ లో హామీలు అమలు చేస్తారా..? ఒకటవ తేది నుండి ఇవన్నీ అమలు చెయ్యాలి.. చేస్తున్నారా..? ప్రతీ మహిళకు 1500 ఎప్పుడు ఇస్తారు..? 20 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తున్నారు..? ఇచ్చిన హామీలు పక్క దారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నాడన్నారు. Also Read: వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక. నన్ను టార్గెట్ చేస్తే వైసిపి ఆగిపోద్దా.. నన్నే కాదు జగన్ నే టార్గెట్ చేస్తారు. అయితే, ఎవరిని టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు. కనీసం రివ్యూ చెయ్యకుండా వైఎస్ జగన్ కు సెక్యూరిటీ తీసేశారన్నారు. రుషికొండ లోని భవనలు జగన్ నివాశాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. Also Read: పవన్ స్పెషల్ ఫోకస్.. ఆ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా..! ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన ఖర్మ జగన్ కు లేదని.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సొంత నివాసాల్లోనే ఉంటారని తెలిపారు. రుషికొండ భవనాలు జగన్ ఇల్లు అని ఎవరు చెప్పారు? వైజాగ్ రాజధానికి తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ గెస్టుల కోసం అదే స్థాయిలో గెస్ట్ హౌస్ కట్టారు. తాడేపల్లిలో సిఎం క్యాంప్ కార్యాలయం కనుక ఫర్నిచర్ వేశారని.. ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల కడితే డబ్బులు కట్టేస్తామని.. లేకపోతే వచ్చి తీసుకుని పొండని అన్నారు. #kodali-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి