Kesineni Nani Vs Devdutt: మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? ముదురుతోన్న వార్!

కేశినేని నానిపై ఫైర్ తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్‌ ఫైర్ అయ్యారు. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు.

New Update
Kesineni Nani Vs Devdutt: మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? ముదురుతోన్న వార్!

కేశినేని(Kesineni) బ్రదర్స్ అనుచరుల మధ్య విభేదాలు మరోసారి తారాస్తాయికి చేరుకున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించింది. సమన్వయ సమావేశం జరుగుతుండగానే చిన్ని(Chinni)గా పేరొందిన కేశినేని శివనాథ్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని-Nani) రాకను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కేశినేని సోదరుల రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపుల ప్రజలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం, ఫర్నీచర్ విసరడం ప్రారంభించి ప్రాంగణాన్ని యుద్ధభూమిగా మార్చారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్సై సతీష్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే తిరువూరు టీడీపీ అభ్యర్థి దేవదత్‌పై మండిపడ్డారు కేశినేని నాని.. అతను పూజకు పనికి రాని పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. నానిపై దేవదత్‌ రివర్స్‌ అటాక్‌కు దిగారు?

మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా?
కేశినేని నాని పై ఫైర్ అయ్యారు దేవదత్. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు. నియోజవర్గంలో మీరు ఒక్కరే గెలిచారు.. ఏడుగురిని ఓడించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 17 సంవత్సరాలు వివిధ దేశాల్లో తిరిగి జ్ఞానం సంపాదించుకున్నానని.. నా ఆఫీసులో ఉండి నన్నే అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువూరులోనే ఉంటా:
అంతకముందు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీశాయి. ఈ నెల 7న చంద్రబాబు 'రా.. కదలి రా..' బహిరంగ సభను విజయవంతం చేసే పూర్తి బాధ్యత తనదేనన్నారు. రేపటి(జనవరి 4)నుంచి సభ పూర్తి అయ్యావరకు తిరువూరులోనే ఉంటానన్నారు. ఏ పదవిలో లేని వ్యక్తులు ఏ విధంగా తిరువూరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏ పదవి ఉందని, చిన్ని తిరువూరు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాడో చెప్పాలన్నారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి దేవ దత్ కాదని.. అతను పూజకు పనికి రాని పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అనవసరమైన వ్యక్తులు వచ్చింది అలజడలు చేయడానికేనని చిన్ని టార్గెట్‌గా కేశినేని నాని విమర్శలు గుప్పించారు.

Also Read: అభయహస్తం దరఖాస్తులపై కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది

New Update
Rains

Rains

Ap Rains: నైరుతి,  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. 'ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి  24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. బుధవారం, గురువారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెట్లు క్రింద నిలబడరాదు' అని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

'అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం నాడు 25 మండలాల్లో వేడగాలులు వీస్తాయి. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా కామవరం 40.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి' అని  కూర్మనాథ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. రానున్న మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్.

ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment