Jupalli Krishna Rao: కేసీఆర్ ఎమ్మెల్యేలను.. పశువులను సంతంలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు:జూపల్లి

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తీరు పై ఫైర్ అవుతూ..ఆయన దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు జూపల్లి.

New Update
Jupalli Krishna Rao: కేసీఆర్ ఎమ్మెల్యేలను.. పశువులను సంతంలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు:జూపల్లి

Jupalli Krishna Rao: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తీరు పై ఫైర్ అవుతూ..ఆయన దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు జూపల్లి.

మరికొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ గద్దె దిగడం ఖాయమన్నారు. ఇక తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారిని.. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన నేతలను తరిమి తరిమి కొడదామని జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే పార్టీ మారిన జూపల్లి తనదైన స్టైల్ లో రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. కొల్లాపూర్ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన తన అనుచరులకు కూడా టికెట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి.. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!

https://rtvlive.com/this-principal-is-torturing-us/

Advertisment
Advertisment
తాజా కథనాలు