MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మోదీని ఎందుకు నిలదీయరు? కవిత సీరియస్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్లను అమలు చేయని ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల వైఖరిని ఆమె తప్పు పట్టారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మహిళా రిజర్వేషన్లను అమలు చేయటానికి తాము ముందుకే వెళతానని స్పష్టంగా చెప్పారు.

New Update
MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మోదీని ఎందుకు నిలదీయరు? కవిత సీరియస్ కామెంట్స్

Kavitha Comments on Women Reservations: రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తాను తలకెత్తుకోలేదని, ఇది మహిళలందరి ఆకాంక్ష అది అని కవిత స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి డిసెంబరులో తాను మళ్లీ దీక్ష చేయాలనుకుంటున్నానని, దీని కోసం మహిళా రాజకీయనేతలను ఆహ్వానించాలనుకుంటున్నట్టు చెప్పారు.
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతిఇరానీలను ఆహ్వానిస్తామని అన్నారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..

* రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళారిజర్వేషన్లు బిల్లు మూడేళ్లయినా ఆమోదం పొందకపోవటమేమిటి?

* మోదీ సర్కారు (Modi Govt) రిజర్వేషన్ బిల్లును ఆమోదించటంలో తాత్సారం చేస్తోంది.

* పార్లమెంటులో (Parliament) మహిళలు కేవలం 12 శాతం మందే ఉన్నారు.

* తొలి లోక్ సభలో 8శాతం మహిళలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12శాతానికి చేరుకుంది.

* మహిళలు ఉన్నతస్థానాలకు చేరకూడదా? సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?

* మహిళా రిజర్వేషన్ (Women Reservations) అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి తదితర నేతలు ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?

* యూపీలో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారు.

* గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారు. ఇంత కంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా?
* ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ కాంగ్రెస్ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు.

Also Read: నేడే మెదక్ కు సీఎం కేసీఆర్..గులాబీమయమైన జిల్లా కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆయన వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్‌ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

కసిరెడ్డిదే కీలక పాత్ర..

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. 

అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)

Advertisment
Advertisment
Advertisment