ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.
కసిరెడ్డిదే కీలక పాత్ర..
ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు.
అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)
MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మోదీని ఎందుకు నిలదీయరు? కవిత సీరియస్ కామెంట్స్
మహిళా రిజర్వేషన్లను అమలు చేయని ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల వైఖరిని ఆమె తప్పు పట్టారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మహిళా రిజర్వేషన్లను అమలు చేయటానికి తాము ముందుకే వెళతానని స్పష్టంగా చెప్పారు.
Kavitha Comments on Women Reservations: రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తాను తలకెత్తుకోలేదని, ఇది మహిళలందరి ఆకాంక్ష అది అని కవిత స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి డిసెంబరులో తాను మళ్లీ దీక్ష చేయాలనుకుంటున్నానని, దీని కోసం మహిళా రాజకీయనేతలను ఆహ్వానించాలనుకుంటున్నట్టు చెప్పారు.
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతిఇరానీలను ఆహ్వానిస్తామని అన్నారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
* రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళారిజర్వేషన్లు బిల్లు మూడేళ్లయినా ఆమోదం పొందకపోవటమేమిటి?
* మోదీ సర్కారు (Modi Govt) రిజర్వేషన్ బిల్లును ఆమోదించటంలో తాత్సారం చేస్తోంది.
* పార్లమెంటులో (Parliament) మహిళలు కేవలం 12 శాతం మందే ఉన్నారు.
* తొలి లోక్ సభలో 8శాతం మహిళలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12శాతానికి చేరుకుంది.
* మహిళలు ఉన్నతస్థానాలకు చేరకూడదా? సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?
* మహిళా రిజర్వేషన్ (Women Reservations) అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి తదితర నేతలు ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?
* యూపీలో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారు.
* గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారు. ఇంత కంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా?
* ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ కాంగ్రెస్ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు.
Also Read: నేడే మెదక్ కు సీఎం కేసీఆర్..గులాబీమయమైన జిల్లా కేంద్రం
BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
Pawan Kalyan: మమ్ముల్ని పవన్ కల్యాణే కాపాడాలి.. జనసేన ఆఫీసుకు బాధితులు.. అసలేమైందంటే?
మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన పలు రైతులు ఈ రోజు జనసేన కార్యాలయానికి వచ్చాయి. చిరుత చనిపోయిన కేసులో అన్యాయంగా తమ వారిని అధికారులు ఇరికించారని వారు వాపోయారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
మావోయిస్టుపార్టీకి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ ఎన్కౌంటర్లో అగ్రనేత వివేక్. క్రైం | Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
BIG BREAKING: జార్ఖండ్లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మృతి!
జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావోయిస్టులు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
సుప్రీకోర్టుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై జేపీనడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
HMD Barbie Phone: రూ.7,999లకే డబుల్ డిస్ప్లే ఫోన్.. సేల్ ప్రారంభం!
KKR vs GT: చేతులెత్తేసిన కేకేఆర్.. గుజరాత్ ఖాతాలో మరో ఘన విజయం
శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?
GT vs KKR: చేజారిపోతున్న మ్యాచ్.. కట్టడి చేస్తున్న గుజరాత్ బౌలర్లు - కెకెఆర్ 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!