AP: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!

అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో భవిష్య అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. బస్సు రోడ్డు పై ఉన్న రాయిని ఎక్కడంతో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్‌ కండీషన్‌ లో లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
AP: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!

Kadapa School Bus Accident: కండిషన్‌ లో లేని ఓ స్కూల్ బస్సు ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం లో జరిగింది. విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న శ్రీవాణి పబ్లిక్ స్కూల్‌ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల పాప భవిష్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

రోడ్డుకు అడ్డంగా ఉన్న రాయి పైకి బస్సు ఎక్కడం వల్ల తిరగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో బస్సు తలుపు పక్కనే కూర్చుని ఉన్న చిన్నారి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయింది. బస్సు బాలిక పై బోల్తా పడడంతో పాప చనిపోయింది. జేసీబీ సాయంతో బస్సును పక్కకు తొలగించగా..బస్సు కింద చిన్నారి కనిపించింది.

అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకపోయినా రవాణా శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్‌ దాడి..ఎక్కడంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
video viral.

video viral

సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

శవం ముందు పెళ్లి డ్యాన్స్

కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

Advertisment
Advertisment
Advertisment