Suraj Revanna: యువకుడిపై లైంగిక దాడి.. మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ పెద్ద కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న హాసన్ జిల్లాలోని ఫామ్ హౌస్ లో సూరజ్ రేవణ్ణ తనపై లైంగిక దాడి చేసినట్లు 27 ఏళ్ల జేడీఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Suraj Revanna: యువకుడిపై లైంగిక దాడి.. మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

Suraj Revanna Arrested: కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ పెద్ద కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అసహజ లైంగిక చర్య ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 16న హాసన్ జిల్లాలోని ఫామ్ హౌస్ లో సూరజ్ రేవణ్ణ తనపై లైంగిక దాడి చేసినట్లు 27 ఏళ్ల జేడీఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోలెనరసిపురా రూరల్‌ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 377, 342, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై స్పందించిన సూరజ్ రేవణ్ణ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. రూ.5 కోట్లు ఇవ్వనందుకు తనపై ఆ యువకుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు.

Also Read: ఓరి వీడి ఏశాలో.. టూరిస్టులను వ్యభిచారులుగా పరిచయం చేస్తూ రీల్స్.. నెటిజన్స్ ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment