Pawan Kalyan: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!

రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేయబోతుందని పవన్ కళ్యాణ్ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కందులు దుర్గేష్ బరిలో ఉంటారని ముఖ్య నాయకులకు జనసేనాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
Pawan Kalyan: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు జనసేనాని. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉత్కంఠతకు పవన్ కళ్యాణ్ తెరదించారు.

Also Read: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు!

టీడీపీ పొత్తులో బాగంగా రాజమండ్రి రూరల్ సీటు జనసేన పోటీ చేయబోతుందని.. కందులు దుర్గేష్ బరిలో ఉంటారని తెలిపినట్లు సమాచారం. పవన్ హామీ ఇచ్చారని సమావేశం అయిన పార్టీ నేతలు అంటున్నట్లు తెలుస్తోంది.  కాగా, గత కొన్ని రోజులుగా రాజమండ్రి రూరల్ నుంచి పొత్తులలో ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠగా ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తానే పోటీ చేస్తున్నానని ప్రచారం చేశారు. మరోపక్క జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ కూడా ఇదే టిక్కెట్టుపై పోటీ పడటంతో గందరగోళం నెలకొంది.

Also Read: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

రాజమండ్రి పర్యటనలో బాగంగా ముఖ్యనాయకులతో బేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజమండ్రి రూరల్ లో జనసేన పోటీ చేస్తుందని తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కందులు దుర్గేష్ పోటిచేస్తారని, అవసరమైతే గోరంట్లతో మాట్లాడుతానని అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని రిపబ్లిక్ డే నాడు పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు