Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు

AP: మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన నేత నాగబాబు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు

Naga Babu: వినుకొండలో రషీద్‌ హత్యపై మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన నేత నాగబాబు. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా కాలేదు.. అప్పుడే విమర్శలా? అని విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్‌ హయాంలో చూశాం అని అన్నారు. జగన్‌ మరోసారి రాకుండా చేసి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు.

శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ నాయకుణ్ణి ప్రజలు నమ్మడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఇప్పుడు జనం గుర్తుచ్చారా? అని నిలదీశారు. జగన్ దొంగ మాటలు, నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే ఢిల్లీలో ధర్నా డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా హింసను అనుభవించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేర్చుతాం అని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు