JSP-TDP: నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం..!

నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్‌ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించడం టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. భారీ ర్యాలీతో నిన్న నిడదవోలులో కందుల ఎంట్రీ ఇవ్వగా ఆయన రాకను టీడీపీ కేడర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

New Update
JSP-TDP: నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం..!

Kandula Durgesh Vs TDP Burugupalli Sesha Rao: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేనకు సీటు కేటాయించడంతో నిడదవోలు టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం అసహనం  వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిడదవోలులో కందుల దుర్గేష్ భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. అయితే, కందుల రాకను నిడదవోలు టీడీపీ కేడర్ వ్యతిరేకించారు. దుర్గేష్ ర్యాలీకి ఏ మాత్రం సహకరించలేదు. దీంతో సొంత వర్గంతోనే కందుల ర్యాలీ చేశారు.

Also Read: ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!

అనంతరం టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు ఇంటికెళ్లారు కందుల దుర్గేష్. కానీ, శేషారావు ఇంట్లో లేరని చెప్పడంతో కందుల నిరాశగా వెనుతిరిగారు. నిడదవోలు టికెట్ పై శేషారావు ముందు నుంచి ధీమాగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో నిడదవోలు టికెట్ జనసేనకు మార్చడంతో ఆయన సహించలేనట్లుగా తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో శేషారావు అయోమయంలో పడ్డారు. సీటు ప్రకటించిన తరువాత కూడా అధిష్టానం నుంచి పిలుపు రాలేదని అలకబూనారని వార్తలు వినిపిస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో కలిసి పోరాడాల్సింది ఉండగా.. నిడదవోలులో మాత్రం టీడీపీ  వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది. తాజాగా జరుగుతున్న రాజకీయాలపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అధిష్టానం శేషారావు కు నచ్చజెప్పి ముందుకు నడిపిస్తుందా లేదంటే చూసిచూడనట్లుగా ఉంటుందా అనేది తెలియాలి..ఒకవేళ హైకమాండ్ ఏ మాత్రం స్పంధించలేదంటే శేషారావు పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. దీనికి సంబంధించి కియా యాజమాన్యం కిందటి నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
ap

KIA Industry

కియా ప్లాంట్ లో ఇంజిన్లు పోయాయి. నమ్మశక్యంగా లేకపోయినా..ఇది నిజంగా జరిగింది. అది కూడా ఆంధ్రాలో ఉన్న కియా పరిశ్రమలో. అది కూడా ఏదో ఒకటి , రెండో పోతే పర్వాలేదులే అనుకోవచ్చును. కానీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీనికి సంబంధించి కియా ప్లాట్ ఓనర్లు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం విషయంలో కియా యాజమాన్యం ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. కానీ దీనికి పోలీసులు నిరాకరించడంతో కంప్లైంట్ ఫైల్ చేశారు.  విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

ఎక్కడ మాయం అయ్యాయో..

అయితే ఈ కార్ల ఇంజిన్లు ఎక్కడ పోయాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్న ప్లాంట్లో కార్లు తయారవుతాయి కానీ విడి భాగాలు అన్నీ ఒక్కో చోట నుంచీ వస్తాయి. కార్ల ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇప్పుడు మాయం అయిన ఇంజిన్లు తమిళనాడు నుంచి రవాణా అవుతున్నప్పుడు పోయాయా లేక పరిశ్రమలోనే చోరీ అయ్యాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారని...త్వరలోనే మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 today-latest-news-in-telugu | kia | cars | andhra-pradesh 

 

Also Read: Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

 

Advertisment
Advertisment
Advertisment