Iraq Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి

ఇరాక్‌ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

New Update
Iraq Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి

Iraq Fire Accident: ఇరాక్‌ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాసేపట్లో పెళ్లి జరగనుంది. దీంతో అప్పటివరకు ఆ హాల్‌ అంతా సందడిగా ఉంది. అంతా ఈ వేడుకలో మునిగిపోయారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాక వధూవరులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఉత్తర నినేవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

రాత్రి 10.45కు ఒక్కసారిగా పెళ్లి మండపంలో మంటలు చెలరేగాయి. కాపాడాలంటూ ఆర్తనాదాలు పెడుతూ అక్కడున్న వారంతా బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే మంటలు చుట్టుముట్టేయడంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వెడ్డింగ్‌ హాల్‌లో వెయ్యి మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలలకు వెడ్డింగ్‌ హాల్‌ మొత్తం బూడిదగా మారిపోయింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. వివాహ వేడుకలో కాల్చిన బాణాసంచా కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనాకొచ్చారు స్థానిక అధికారులు. ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వివాహ సమయంలో బాణసంచా పేల్చటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫంక్షన్ హాల్‌లో సామాగ్రికి వేగంగా మంటలు అంటుకోవటంతో వేడుకలో పాల్గొన్నవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అక్కడికి అంబులెన్స్‌లు పంపించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని వెల్లడించారు.

ఇదది కూడా చదవండి: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త

నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.

New Update
man kill his wife

man kill his wife Photograph: (man kill his wife)

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.  ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

అస్మాఖాన్‌ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని వారి కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment