చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దారుణం.. చేతబడి సాకుతో మహిళ సజీవ దహనం!

మెదక్ జిల్లా రామాయం పేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ నివాసముంటుంది. చేతబడి చేస్తుందనే అనుమానంతో చుట్టుపక్కల వారు ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మరణించింది.

author-image
By Seetha Ram
New Update
pretext of sorcery

ప్రపంచమంతా ఓవైపు సాంకేతిక పరిజ్ఞానంతో భూమి నుంచి ఆకాశానికి పరుగులు పెడుతుంటే.. కొందరేమో ఇంకా మూఢ నమ్మకాల పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. చేతబడులంటూ అనుమానం ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. మరికొందరేమో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అలాంటి ఓ కారణంతో చేతబడి చేస్తుందన్న సాకుతో ఓ మహిళపై అతి దారుణంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పెట్రోల్ పోసి సజీవ దహనం

మెదక్ జిల్లా రామాయం పేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ(45) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె చేతబడి చేయడంతోనే తరచూ అనారోగ్యానికి గురవుతున్నామనే అనుమానంతో గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. గురువారం రాత్రి ఇంట్లో ఉన్న ముత్తవ్వను దారుణంగా కొట్టారు. ఆపై పెట్రోల్ పోసి నిపంటించారు. దీంతో ఆమె అరుపులు విన్న కొందరు వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండిః కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి!

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వెంటనే రామాయంపేట హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మరణించింది. దీంతో మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆధునిక కాలంలో మంత్రాల పేరుతో ఓ మహిళను సజీవ దహనం చేయడం అత్యంత దారుణమైన విషయమని అన్నారు.

ఇలాంటి ఒక సంఘటనతో సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. ప్రజలెవరూ ఇలాంటి మూఢనమ్మకాలని, మంత్రాలను నమ్మవద్దని సూచించారు. దీనిపై పోలీసులు ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని అన్నారు. ఇకనైనా ప్రజలు మారాలని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

 

 

Advertisment
Advertisment
Advertisment