Mukkoti Ekadasi: ఇవాళ గుడికి వెళ్తున్నారా? అయితే శంఖు తీర్థం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా?

నేడు ముక్కోటి ఏకాదశి. విష్ణుభక్తులు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయుడిని దర్శించుకుంటారు. అయితే శంకుతీర్థాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. క్షీరసాగర మథనాన్ని దేవతలు, రాక్షసులు చేపట్టారని..ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీతోపాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

New Update
Mukkoti Ekadasi: ఇవాళ గుడికి వెళ్తున్నారా? అయితే శంఖు తీర్థం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా?

Are You Going To Temple : దక్షిణవర్తి శంఖం అంటే ఏంటి...ఈ శంఖానికి పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి..హైందవ సంప్రాదయంలో ఒక్కో వస్తువుకు ఒక్క ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని వస్తువులు శుభాలను కలిగిస్తే..మరొకొన్ని అశుభ ఫలితాలను కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.పౌరాణిక గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనాన్ని దేవతలు, రాక్షసులు చేపట్టారు. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీతోపాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించిందని పురాణాలు అంటున్నాయి. అందుకే దక్షిణావర్తి శంఖంకు హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవితోపాటు ఈ శంఖాన్ని పూజించినట్లయితే కష్టాలు తీరి శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

దక్షిణవర్తి శంఖంను పూచించడం, ఇంట్లోని పూజ గదిలో దాన్ని ఉంచడం వల్ల శ్రీ మహాలక్ష్మీ(Sri Mahalakshmi) అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండందంటున్నారు. సాధారణంగా సముద్రంలో ఎడమ రెక్కలు ఉన్న శంఖాలే కనిపిస్తాయి. సాధారణ శంఖాలు ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. అదే దక్షిణ శంఖ ముఖం కుడివైపు తెరిచి ఉంటుంది. ఈ శంఖాన్ని చాలా పవిత్రమైందిగా ప్రయోజకరమైందిగా భావిస్తారు.

వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) నాడు వైష్ణవ ఆలయాల్లో దక్షిణావర్తి శంఖంలో తీర్థాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఈ శంఖంలో తీర్థం తాగడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అక్చులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్న మహావిష్ణువు, లక్ష్మీదేవి సమేతంగా అనుగ్రహం ఇస్తారని భక్తులు నమ్ముతుంటారు. అలాంటి శంఖంలో తీర్థం పుచ్చుకోవడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతుంటారు.

నిత్యం ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం వల్ల శుభప్రదంగా భావిస్తారట. ఇంట్లో ఉంచుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. శుభ్రమైన ఎరుపు వస్త్రంలో ఈ శంఖంను ఉంచి...గంగాజలంతో నింపాలి. ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించి పూజ గదిలో పెట్టాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టాలి. దీనిని ప్రతిశుక్రవారం పూజిస్తే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని పండితులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్-3, హమాస్ అంటే ఏంటి? తో పాటు.. ఈ ఏడాదిలో గూగుల్ లో టాప్ సెర్చ్ లు ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment