Health Tips : గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే..ఈ 4 వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

నెయ్యి వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చల్లని వాతావరణంలో నెయ్యి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే మలబద్ధకం, చర్మ సమస్యలు, దగ్గు, కఫం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

New Update
Health Tips : గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే..ఈ  4 వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

Ghee Benefits In Winter : చలి కాలంలో వీలైనంత ఎక్కువ వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో నెయ్యి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. నెయ్యిలో వార్మింగ్ ఎఫెక్ట్ ఉంది. (Ghee Benefits In Winter) ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వృద్ధులు చలి నుండి సురక్షితంగా ఉండాలంటే నెయ్యి తీసుకోవాలి. చాలా మందికి ఆహారంతో పాటు నెయ్యిని తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే మీరు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలపడం ద్వారా కూడా తాగవచ్చు.(Benefits of ghee with warm water). గోరువెచ్చని నీళ్లలో నెయ్యిని కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.(Warm Water With Ghee).

వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మలబద్ధకం:
మలబద్ధకం సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం మంచిది. నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు పొడిబారడంతోపాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనివల్ల మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

2. చర్మం కోసం:
నెయ్యి గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. నెయ్యి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు, మెరిసే చర్మం కలిగి ఉండాలంటే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగాలి.

3. దగ్గు, కఫం కోసం:
చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోరువెచ్చని నీటిలో దేశీ నెయ్యి కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి వేసి ఉదయాన్నే తాగాలి. దీన్ని తాగడం వల్ల ముక్కు, గొంతు, ఛాతీలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

4.కళ్ల కోసం:
గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. దేశీ నెయ్యిలో ఉన్న ఒమేగా-3 కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీన్ని తాగడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.

దీన్ని ఇలా ఉపయోగించండి:
గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి, ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిని తాగాలి.

ఇది కూడా చదవండి: పెళ్లి నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment