Rajendranagar: దివ్యాంగుడు పుట్టాడని భార్యను వదిలేసిన భర్త

రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్య(అలేఖ్య) ఒక దివ్యాంగుడికి జన్మనిచ్చిందనే కారణంతో భర్త (ఉదయ్) ఆమెను వదిలేశాడు. పిల్లవాడిని బయటే వదిలేసి రావాలని కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళన చెందిన అలేఖ్య.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది.

New Update
Rajendranagar: దివ్యాంగుడు పుట్టాడని భార్యను వదిలేసిన భర్త

Rajendranagar: రాజేంద్రనగర్ హైదర్ గూడలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డ, పట్ల కఠినంగా ప్రవర్తించాడు మానవత్వం లేని ఓ తండ్రి. దివ్యాంగుడిగా పుట్టాడని బిడ్డను వదిలేశాడు. ఆ బిడ్డను కన్నందుకు భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. అసలు వివరాల్లోకి వెళితే..

కన్నబిడ్డ పట్ల తండ్రి కఠినత్వం

రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడాలో బీటుకూరి ఉదయ్ భాస్కర్‌, అలేఖ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొన్నాళ్ల క్రితం ఒక బాబు పుట్టాడు. అయితే ఆ బాబు దివ్యాంగుడు కావడంతో.. మానవత్వం మర్చిపోయిన ఉదయ్ కన్న కొడుకు, భార్య పట్ల కఠినంగా ప్రవర్తించాడు. దివ్యాంగుడిని కన్నావంటూ భార్యను చివాట్లు పెట్టాడు. పిల్లవాడిని బయటే వదిలేసి రావాలని.. లేదంటే ఇంట్లోకి రానివ్వడం కుదరదని కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు చెందిన అలేఖ్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తతో వాదించింది. అయినప్పటికీ భర్త ఉదయ్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో.. కొడుకుతో కలిసి భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటానికి దిగింది అలేఖ్య .

Also Read: Uttar Pradesh : మరో ఘోరం.. నర్సు పై హత్యాచారం..తొమ్మిదిరోజులకు మృతదేహం గుర్తింపు! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment