గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు

నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.

New Update
గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు

Cash seized in Gudur: ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొన్ని నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయనగా.. నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మద్యం, నగదు అక్రమంగా తరలించే అవకాశం ఉండడంతో టోల్‌ప్లాజాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టి పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నైకి కొందరు వ్యక్తులు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 5.12 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో నగదును సీజ్‌ చేసిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్లకూరు జాతీయ రహదారితో పాటు గూడూరు పట్టణం, గూడూరు రూరల్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: వర్షిణీ మిస్సింగ్.. రంగంలోకి అఘోరీ- అరెస్టు చేయాలని డిమాండ్!

శ్రీవర్షిణీ ఇంకా ఇంటికి చేరుకోకపోవడంపై అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తుంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది.

New Update

అఘోరీ- శ్రీవర్షిణీ ఇష్యూ మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల అఘోరీ నుంచి తన చెల్లి వర్షిణీని తీసుకొచ్చిన హర్ష, విష్ణులు.. ఆ తర్వాత ఒక హోటల్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వర్షిణీని ఇంటికి తీసుకొస్తున్నట్లు ట్రైన్‌లో ఉన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

విష్ణుపై కేసు నమోదు చేయండి

ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ రంగంలోకి దిగింది. RTV  ఛానెల్‌తో లైవ్‌లో మాట్లాడింది. వర్షిణీ అన్నయ్య విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తోంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ చెప్పుకొస్తుంది. ఈ మేరకు శ్రీవర్షిణీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అఘోరీ అంటోంది. తన దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్లు మొదటగా పోలీసుల వద్దకు వెళ్లాలని.. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ వద్దకు చేర్చాలని డిమాండ్ చేసింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

కానీ ఎక్కడా చేర్చకుండా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించింది. అసలు విష్ణుకి వర్షిణీ ఫ్యామిలీతో ఏంటి సంబంధం.. వారితో ఎందుకు ఆడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ప్రజలు ఎంతో మంది తనను విమర్శించారని.. ఆడపిల్లను వదిలేయాలని అన్నారని.. కానీ ఇప్పటి వరకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లకపోవడానికి గల కారణం ఏంటని ఎందుకు ప్రశ్నించడంలేదు అని పేర్కొంది. నాలుగు రోజులు అవుతున్నా.. ఎందుకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ పిల్లని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

(sri varshini | aghori sri varshini | aghori | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment