Hyd Rain: నగర శివారులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.!

నగర శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. తుమ్మలూరు, కందుకూరు రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. చెట్లను తొలగించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

New Update
Weather Alert : రాగల రెండ్రోజుల పాటు వర్షాలు..

Hyd Rain:  హైదరాబాద్ నగర శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు, కందుకూరు రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై పడిన చెట్లను తొలగించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అటు గత కొన్ని రోజులుగా నిప్పులు కొలిమిలా మారిన తెలంగాణ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం కాస్త చల్లబడింది. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మూడు , నాలుగు గంటల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. 

ఇక తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకఅటు ఏపీలోనూ ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉత్తరకోస్తాతోపాటు దక్షిణకోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌, జైస్వాల్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్‌ (15) ఔట్‌ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్‌ పరాగ్‌ (30), జైస్వాల్‌ (75), హెట్‌మయర్‌ (9), ధ్రువ్‌ జురెల్‌ (35*), నితీశ్‌ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్‌ (65) ఔట్‌ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్‌ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment