Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!

New Update
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..

భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి.తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు (TS Schools Summer Holidays)ఉండే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్(Schools Reopen) అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది.

ఇటీవల ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసి.. ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీన పూర్తవుతాయి.ఒకటి నుంచి 7 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 నిమిషాల వరకు .. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.వీటి ఫలితాలను 23వ తేదీన విడుదల చేసి.. అదే రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం తెలంగాణలో 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రత ఇలానే కొనసాగితే ఈ వేసవి సెలవులను కూడా పొడిగించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఏపీలో కూడా ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూల్స్ వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.గ‌త ఏడాది తెలంగాణ‌ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. గ‌త ఏడాది వేస‌వి సెల‌వులు త‌క్కువ‌గానే ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment