Chennai : తల్లిపాలను విక్రయిస్తున్న స్టోర్ సీజ్ చేసిన అధికారులు.. కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకి హానికరమని తెలుసా?

చట్ట విరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న చెన్నైలోని ఓ స్టోర్ పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు దాడులు నిర్వహించారు. పాల బాటిళ్లను సీజ్ చేశారు. మరోవైపు కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిశువుకు అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

New Update
Chennai : తల్లిపాలను విక్రయిస్తున్న స్టోర్ సీజ్ చేసిన అధికారులు.. కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకి హానికరమని తెలుసా?

FSSAI seized the store selling breast milk : తల్లిపాలు శిశువుకి ఎంతో బలవర్ధకమైనవి. వీటిలో ఉండే ప్రొటీన్లు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. బిడ్డకు తల్లిపాలు అందించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు పట్టించడం వల్ల హాని కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లో తల్లిపాలు విక్రయించడం నిషేధమని తెలిసినా కొన్ని స్టోర్లు అడ్డకోలుగా వీటిని విక్రయిస్తూనే ఉన్నాయి. తాజాగా చెన్నైలో ఓ స్టోర్ ను సీజ్ చేశారు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు. పాల బాటిళ్లను పరీక్షలకు పంపారు.

చెన్నైలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు తల్లిపాలను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న ఔట్‌లెట్‌పై దాడులు నిర్వహించారు. కొందరి పిర్యాదు మేరకు స్టోర్ పై నిఘా పెట్టిన అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్టోర్ లో ఎటువంటి విక్రయాలు జరగకపోయినా తల్లిపాలను దాచిన స్టాక్ బయటపడింది. 50ml బాటిల్ ధర రూ.500 కాగా ప్రస్తుతం ఆ బాటిళ్లను పరీక్షల కోసం పంపారు. తల్లిపాలను విక్రయించడం భారతదేశంలో నిషేధం. అలా చేస్తే FSS చట్టం 2006 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. మరోవైపు కొనుగోలు చేసిన తల్లిపాలు బిడ్డకు తాగించడం వల్ల శిశువుకు హానికరం అంటున్నారు నిపుణులు.

కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు తాగించడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. HIV, హెపటైటిస్ వంటి వాటితో పాటు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పాలు సరిగ్గా పరీక్షించకపోయినా, పాశ్చరైజ్ చేయకపోయినా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన తల్లిపాలు పరిశుభ్రంగా ఉండకపోయినా.. భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా బిడ్డకు హాని కలిగించవచ్చును. తల్లిపాలను సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోతే హానికరమైన బాక్టీరియా ప్రబలుతుంది. తల్లిపాలను నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. లేదంటే బాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాల భద్రత, నాణ్యత, స్వచ్ఛతపై ఆరోగ్య అధికారుల నుండి ఎలాంటి హామీ కూడా ఉండదు. అందుకే వీటిని చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసి శిశువు హాని కలిగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment