Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్‌ రోడ్డులో వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు.

New Update
మద్యం మత్తులో  ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి

Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్‌ రోడ్డులో వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని వెల్లడించారు. వారిలో ఇద్దరు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టీ)కి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు