Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.

New Update
Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!

EX.MP Chintha Mohan: వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.

Also Read: జగన్ పక్క ప్లానింగ్ తోనే ఇలా అన్నారు.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!

గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుకు పార్టీ ఇచ్చిన నగదును ఓ పోలీస్ అధికారి స్థానికంగా ఉన్న ఎస్ఆర్ఎం లాడ్జిలో కూర్చొని పంపిణీ చేశారని ఆరోపించారు. అయితే అధికారి పేరు చెప్పడానికి నిరాకరించారు. దుగ్గరాజపట్నం పోర్టును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడ్డుపడిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు