Telangana Elections: బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..

చెన్నూరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్‌కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఆయన నడుపుతున్న బోగస్ కంపెనీల వివరాలు, లావాదేవీలు జరిగే తీరుతెన్నులు వెల్లడించింది. తాజాగా రూ. 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.

New Update
Telangana Elections: బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..

Telangana Elections 2023: మాజీ ఎంపీ, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి​ గడ్డం వివేక్‌(G Vivek)కు ఎన్నికల సమయంలో షాక్​ తగిలింది. వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ​లిమిటెడ్ ​నుంచి విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్​ సంస్థకు వెళ్లిన రూ. 8 కోట్లు.. వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ ​సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని, వివేక్ కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల విశాఖ ఇండస్ర్టీస్‌​కు చెందిన బేగంపేటలో ఉన్న ఓ బ్యాంకు నుంచి విజిలెన్స్​ సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఆదర్శ్‌ ​నగర్‌లో ఉన్న బ్యాంక్​ అకౌంట్​లోకి 8 కోట్ల రూపాయలు రియల్ టైం గ్రాస్​ సెటిల్​మెంట్ ​పద్దతిన ట్రాన్స్‌ఫర్ ​అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సమాచారం అందుకున్న సైఫాబాద్‌ ​పోలీసులు విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్‌​కు చెందిన ఖాతా వివరాలను తెలుసుకుని ఆ 8 కోట్ల రూపాయలను ఫ్రీజ్​ చేశారు. ఈ సమాచారాన్ని ఈడీ, ఆదాయపు పన్ను శాఖతోపాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్​ అధికారికి తెలిపారు.

ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మంగళ, బుధవారాల్లో వివేక్‌కు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ర్టీస్, విజిలెన్స్ ​సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వాస్తవానికి విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్​ వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద, ఆయన భార్య, ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్​ సెక్యూరిటీ సర్వీసెస్‌తో 100 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు ఈడీ అదికారులు. ఈ లావాదేవీల్లో 20 లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్​ షీట్​లో పేర్కొన్నారన్నారు. విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్‌​కు ధీర్ఘకాలిక రుణాలు, అడ్వాన్సుల రూపంలో రూ. 64 కోట్లు ఉన్నట్లు చూపారు.

ఇక, విచారణలో బ్యాంకు ఖాతాను విశ్లేషించినప్పుడు రూ. 200 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టుగా వెల్లడైందన్నారు ఈడీ అధికారులు. విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్ ​ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. నిజానికి దీని మాతృసంస్థ యశ్వంత్​ రియల్టర్స్ ​అని తేలిందన్నారు. యశ్వంత్​ రియల్టర్స్‌​కు చెందిన అత్యధిక షేర్లు ఓ విదేశీయుని పేరు మీద ఉన్నట్టు తెలిపారు. తనిఖీల్లో డిజిటల్ ​డివైజ్‌లు, డాక్యుమెంట్లు, కోట్లాది రూపాయల లెక్క లేని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. దాంతోపాటు ప్రాపర్టీ డీల్స్‌లో పెట్టిన లెక్కల్లో చూపించని వందల కోట్ల రూపాయల వివరాలు లభ్యమైనట్టు ప్రకటించింది ఈడి. వివేక్ గ్రూపులోని కంపెనీల్లో జరిగిన ఇంటర్నల్ ​లావాదేవీలకు చెందిన సమాచారం కూడా దొరికినట్టు చెప్పారు. వాస్తవానికి విజిలెన్స్​ సెక్యూరిటీ సర్వీసెస్​ బోగస్ ​సంస్థ, అది పేర్కొన్న చిరునామాలో ఎలాంటి ఆఫీస్​ లేదని స్పష్టం చేసిన ఈడి.

Also Read:

పువ్వాడా మజాకా.. మార్క్ ప్రచారంతో హోరెత్తిస్తున్న మంత్రి.. ఫోటోలు వైరల్..

శబరిమలకు మరో 64 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలివే..

Advertisment
Advertisment
తాజా కథనాలు