Millets Benifits: రక్తపోటు, మధుమేహం ఉందా.. వీటిని తప్పక తీసుకోండి..!

ఈ మధ్య కాలంలో చాలా మంది మిల్లెట్ ఫుడ్స్ తినడానికి మక్కువ చూపుతున్నారు. వీటిలోని అధిక ఫైబర్, విటమిన్స్, మినరల్స్ రక్తంలోని చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించి.. మధుమేహం, రక్తపోటు సమస్యలను దూరం చేస్తాయి.

New Update
Millets Benifits: రక్తపోటు, మధుమేహం ఉందా.. వీటిని తప్పక తీసుకోండి..!

Millets Benifits: జీవన శైలి వ్యాధులతో బాధపడే వాళ్ళు.. వారి ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చుకోవడానికి మక్కువ చూపుతారు. మిల్లెట్స్ తినడం వల్ల జీవన శైలి వ్యాధుల ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వీటిలోని తక్కువ గ్లైసెమిక్ విలువలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు వీటిలోని అధిక ఫైబర్ గుణాలు శరీరంలోని కొవ్వును నియంత్రించడంలో తోడ్పడుతుంది.

చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

జీర్ణక్రియ (Digestion) ససమస్యలతో బాధపడే వాళ్ళను వీటిని తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలలో జీర్ణక్రియ సమస్యలకు కారణమయ్యే గ్లూటెన్ శాతం తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Also Read: ఉదయాన్నే స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

రోగ నిరోధక శక్తి (Immunity Power) తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి.

మధుమేహ (Diabetes) సమస్యలు దూరం

మిల్లెట్స్ (Millets)  అధికంగా ఫైబర్ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలోని ఫైబర్ గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడంతో పాటు.. రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె సమస్యలను తగ్గించును

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మిల్లెట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఫైబర్, మినరల్ కంటెంట్ రక్తంలోని కొవ్వు స్థాయిలను తగ్గించి గుండె సమస్యల నుంచి కాపాడతాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది

అధిక రక్తపోటుతో బాధపడేవాళ్లు వీటిని తింటే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మిల్లెట్స్  తక్కువ ఉప్పు శాతం, మంచి కొవ్వులను కలిగి రక్తపోటు సమస్యలను దూరం చేయడంలో సహాయపడును.

బరువు తగ్గించడంలో సహాయం

ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులతో బాధపడే వాళ్లకు మిల్లెట్స్ సరైన ఎంపిక. వీటిలోని అధిక ఫైబర్ గుణాలు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉందనే భావనను కలిగించి.. బరువు తగ్గడంలో సహాయపడును.

Mental Health: మీ పిల్లలు ఇలా చేస్తున్నారా..? వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు