CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్‌... సర్వేయర్‌ సస్పెండ్‌!

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసుకోగా డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ రూ. 1.80 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

Chittoor District : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది.

దానిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ (TDP) నాయకులు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సెన్‌ రూ. 1.80 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి.

గత నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ (R&B) అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా...కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆరా తీయగా..ఈ లంచం బాగోతం వెలుగు చూసింది.

సర్వే శాఖ ఏడీ గౌస్‌ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా.. లంచం తీసుకున్న మాట నిజమే అని తెలిసింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్‌ లక్ష డిమాండ్‌ గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీని పై విచారణ జరిపి.. అది కూడా నిజమే అని అధికారులు నిర్థారించారు. ఈ అంశాల పై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏడీని ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Also read: 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు