cricket:స్కాలర్ షిప్ కోసం క్రికెట్ ఆడిన దక్షణాఫ్రికా ఆటగాడు!

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ క్రికెట్ కెరీర్ చాలా ఆసక్తికరం. 15 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడాడు. ఉచితంగా చదువుకోవటం కోసం క్రికెట్‌ లోకి అడుగుపెట్టాడు. దాంతో క్రికెట్ ఆడుతూ ఉన్నత విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు.

New Update
cricket:స్కాలర్ షిప్ కోసం క్రికెట్ ఆడిన దక్షణాఫ్రికా ఆటగాడు!

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ ( Nandre Berger)ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని కలలో కూడా ఊహించలేదు. ఉచిత చదువుల కోసం ఎంచుకున్న క్రికెట్‌ తనని ఇంత దూరం తీసుకువస్తుందని అసలు ఊహించలేదు. అతను 2014లో జరిగిన క్రికెట్ ట్రయల్స్ ద్వారా విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయంలో పూర్తి స్కాలర్‌షిప్ తో ప్రవేశం పొందాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. 28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బర్గర్ మూడు ఫార్మాట్లలో  దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ గా దూసుకెళుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బర్గర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ బర్గర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

నాండ్రే బర్గర్ గత నెలలో జరిగిన SA20లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు.  ESPN క్రిక్ ఇన్ఫోతో , నాండ్రే బెర్గర్,మాట్లాడుతూ.. క్రికెట్‌ ఆడే విద్యార్థులకు విట్స్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. నేను క్రికెటర్‌ని కావాలనుకోలేదు కానీ ఉచిత విద్య కోసం బంతిని విసరటం ప్రారంభించాను. నా చదువుకు క్రికెట్‌ ఒక బ్యాక్‌అప్‌ అనుకున్న కాని నన్ను ఇంత దూరం తీసుకువస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను బంతి ని విసరటం ఆండ్రీ బెర్గర్  విశ్వవిద్యాలయ కోచ్ నీల్ లెవెన్సన్ గుర్తించాడు. నేను టెన్నీస్ ఛాంపియన్ షిప్ ఆడేటప్పుడు   గంటకు 125 కిమీ వేగంతో బౌలింగ్ వేసేవాడిని. ఆతర్వాత మొదట నవ్వాను. ఆ తర్వాత క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ.. 145 కిమీ వేగాన్ని అందుకున్నాను. 

 లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ సీజన్‌లో నాండ్రే బెర్గర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 15 సంవత్సరాల వయస్సులో, ప్రాంతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో బెర్గర్ అతని వయస్సులో అగ్రశ్రేణి ఆటగాళ్ళలో ఒకడు. 17 సంవత్సరాల వయస్సులో, అతను దక్షిణాఫ్రికా నేషనల్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే వెన్ను గాయం కారణంగా క్రికెట్‌ వైపు మొగ్గు చూపాడు.

నాంద్రే బెర్గర్ దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టులు, 3 ODIలు ,1 T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 11 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. టీ20లో బర్గర్‌కు 1 వికెట్ ఉంది. బర్గర్ 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 138 వికెట్లు పడగొట్టాడు.నాంద్రే బెర్గర్ దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టులు, 3 ODIలు మరియు 1 T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 11 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. టీ20లో బర్గర్‌కు 1 వికెట్ ఉంది. బర్గర్ 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 138 వికెట్లు పడగొట్టాడు.

#nandre-berger #south-african #bowler
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గ...

Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..

డాక్టర్లకు సాధ్యం కానిది చాట్ జీపీటీ చేసి చూపించింది. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఎదురైన ఆరోగ్య సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
CHat gpt

ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది అంటే ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది నిజమని ప్రూవ్ అవుతోంది. తాజాగా చాట్ జీపీటీ చేసిన ఓ పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. డాక్టర్లకు అంతుపట్టని సమస్యను ఇట్టే పసిగట్టింది చాట్ జీపీటీ. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఓ వింత సమస్య వచ్చింది. బాబు పళ్ళు సరిగ్గా పెరగకపోవడం, ఉన్నట్టుండి శరీరం తూలటం వంటి లక్షణాలతో బాధపడతున్నాడు. అలెక్స్ ను అతని పేరెంట్స్ చాలా ఆసుపత్రులు తిప్పారు. పదిహేడు మంది డాక్టర్లు అతనికి అన్ని పరీక్షలూ చేశారు. కానీ జబ్బేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఎంఆర్ఐ లాంటి పెద్ద పరీక్షలను కూడా చేయించారు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు.

రిపోర్టులు చూసి చెప్పేసింది..

డాక్టర్లు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన అలెక్స్ తల్లిదండ్రులకు చాట్ జీపీటీ గుర్తుకు చవ్చింది. అంతే దానికి ఎంఆర్ఐ రిపోర్టులు, లక్షణాలు అన్నీ వివరంగా చెప్పారు. ఒక్కొక్కటీ ఓపికగా వివరించారు. అన్నీ చెప్పగానే కొద్ది నిమిషాల్లో చాట్ జీపీటీ పిల్లాడికి ఉన్న జబ్బును గుర్తుపట్టింది. దాన్ని ‘టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌’ సమస్యని నిర్ధరించింది. ఇదో అరుదైన నాడీ సమస్యని తేల్చి చెప్పింది. ఈ జబ్బు వెన్నెముకను ఎఫెక్ట్ చేస్తుంది. ఎదుగుదల, కదలికలు వంటి వాటిని ప్రభావితం చేసి దెబ్బతీస్తుంది. ఇవన్నీ చాట్ జీపీటీ తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. అంతేకాదు ఈ జబ్బు పేరుతో ఒక ఫేస్ బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది. ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ ను కలవమని కూడా సలహా ఇచ్చింది. 

చాట్ జీపీటీ సలహాతో అలెక్స్ తల్లిదండ్రులు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అక్కడ అందిన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళారు. న్యూరో సర్జన్ ను కలిశారు. చాట్ జీపీటీ చెప్పిన వివరాలు అన్నీ ఆయనకు కూడా తెలిపారు. అనంతరం డాక్టర్ సలహా మేరకు అలెక్స్ కు ఆపరేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అలెక్స్ తల్లి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొంతమంది ఏఐ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే..మరి కొంత మంది అన్ని సార్లు అలా జరగదని అంటున్నారు. చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎప్పటికీ డాక్టర్లు ప్రత్యామ్నాయం కాలేవని హెచ్చరిస్తున్నారు. 

 today-latest-news-in-telugu | chat-gpt | doctors | kid

Also Read: USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్

 

Advertisment
Advertisment
Advertisment