Bigg Boss : పల్లవి ప్రశాంత్‌ సూసైడ్‌ చేసుకుంటాడేమో : సీపీఐ నారాయణ!

కేవలం ప్రశాంత్‌ మీద కాదు..బిగ్‌ బాస్‌ మేనేజ్‌మెంట్‌, హోస్ట్‌ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ నారాయణ అన్నారు. '' ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు.అతను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
CPI Narayana: జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

CPI Narayana : బిగ్‌బాస్‌(Bigg Boss 7 Telugu) ఇప్పటి వరకు 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఆదివారం బిగ్‌బాస్ 7 సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌(Pallavi Prasanth) నిలిచాడు. కార్యక్రమం ముగిసిన తరువాత ప్రశాంత్‌ పోలీసుల సూచనలను ఉల్లంఘించినందుకు అతని పై కేసు నమోదు చేయడంతో అందరూ ప్రశాంత్‌ అరెస్ట్ తప్పదు అని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కూడా గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు..అతను పరారీలో ఉన్నాడనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అతని గురించి వెదుకుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నేను ఎక్కడికి పారిపోలేదు. మా ఇంటి వద్దనే ఉన్నాను.

కావాలనే కొందరు నా పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించాలని చూస్తున్నారని ఓ ఎమోషనల్‌ వీడియోను ప్రశాంత్‌ విడుదల చేశాడు. నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే నన్ను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారంటూ అతను వాపోయాడు. ఇదంతా ఇలా ఉంటే..అసలు ముందు నుంచి కూడా బిగ్‌ బాస్‌ షో మీద మంచి అభిప్రాయం లేని సీపీఐ నారాయణ దీని గురించి స్పందించాడు.

కేవలం రైతు(Farmer) బిడ్డ ప్రశాంత్‌ మీద కాదు..బిగ్‌ బాస్‌ మేనేజ్‌మెంట్‌ తో పాటు హోస్ట్‌ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు. '' బిగ్‌ బాస్‌ లో పాల్గొన్న వారి పై పోలీసులు ప్రతాపం చూపడం సరికాదు. ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు. ప్రస్తుతం ప్రశాంత్‌ పరారీలో ఉన్నాడు..అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. అతను కానీ ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? తక్షణమే అతని మీద పెట్టిన కేసులన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని పోలీసులు బహిరంగంగా చెప్పాలి.

ప్రశాంత్‌..నువ్వెక్కడున్నా కూడా సీపీఐ ఆఫీసుకు రా..మేం నీకు రక్షణ కల్పిస్తాం అంటూ సీపీఐ నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్‌ అడ్వకేట్ రాజేశ్‌ కూడా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లేదు. కేసు నమోదు చేసినప్పుడు కనీసం నిందితునికి ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వాలి కాదు. అప్పుడే కాదా నిందితునికి బెయిల్‌ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

Also read: ‘హిందీ నేర్చుకోవాల్సిందే..’ ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment