KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. "వారం రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం సీఎంను నిత్యం పర్యవేక్షిస్తుంది. కొన్ని రోజుల్లోనే ఆయన కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు" అని తెలిపారు. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఈనెల 29న కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కానుందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది. అలాగే గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో దానిపై ప్రధానంనగా చర్చించే అవకాశముంది. గవర్నర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలా..? లేదా ఇతరులను నామినేట్ చేయాలా..? అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోపైనా చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలియడంతో కేబినెట్ భేటీ ఉంటుందో లేదో అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Advertisment
Advertisment
తాజా కథనాలు