CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు.

New Update
CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. సోషల్ మీడియా, ఐటీడీపీకి ప్రతి సమాచారం ఇవ్వాలని అన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని చెప్పారు.

ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని చెప్పారు. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలని కోరారు. కార్యకర్తలకు అండగా నిలబడాలని.. వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.

Also Read : రోడ్డుపై ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని మహిళపై దాడి..

Advertisment
Advertisment
తాజా కథనాలు