CM Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు. అనంతరం శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Update
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు

CM Chandrababu: ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సీఎం చంద్రబాబు ఏపీకి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఆయన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన అనంతరం మరో పర్యటనకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు.

జలాశయ మరమ్మతు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, నారాయణ పాల్గొంటారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం సత్యవేడు శ్రీసిటిలో సీఎం పర్యటిస్తారు. కొన్ని పరిశ్రమలకు భూమిపూజ, మరి కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు తమ జిల్లాలకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

Also Read : 300 అడుగుల లోయలో పడ్డ పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు