Surya: ‘వీరభద్రుడు’ సక్సెస్ తో ఫుల్ స్వింగ్‌లో సూర్య.. లైనప్ మాములుగా లేదుగా!

సూర్య ‘వీరభద్రుడు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు జీతు మాధవన్ దర్శకత్వంలో 47వ సినిమా, ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో 48వ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 2027లో పెద్ద ప్రాజెక్టులతో సూర్య బిజీగా ఉన్నాడు.

New Update
Surya

Surya

Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘వీరభద్రుడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా సూర్యకు పెద్ద ఊరట అనే చెపొచ్చు. ఇందులో ఆయన పూర్తిస్థాయి హీరో కాకపోయినా, కీలకమైన ఎక్స్‌టెండెడ్ క్యామియో పాత్రలో కనిపించాడు.

మొదట్లో ఈ సినిమా సూర్య ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా అని ప్రచారం జరిగింది. కొన్ని సీన్లు బాగా వర్కౌట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ విజయానికి సూర్యకే ఎక్కువ క్రెడిట్ దక్కింది. అభిమానులు కూడా ఈ సక్సెస్‌తో సంతోషంగా ఉన్నారు.

ఈ విజయంతో సూర్య ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తన 47వ సినిమాను షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మలయాళంలో ‘ఆవేశం’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక సూర్య తన 48వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘జై భీమ్’ వంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించిన టీజే జ్ఞానవేల్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇటీవల ఆయన చెప్పిన కథ సూర్యకు చాలా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా సూర్య ‘జగరం స్టూడియోస్’ బ్యానర్‌లో రూపొందనుంది.

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. 2027 సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా వేగంగా షూటింగ్ జరగనుంది.

అదే సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

మొత్తం మీద సూర్య ఇప్పుడు వరుసగా కొత్త సినిమాలతో బిజీగా ఉండగా, అభిమానుల్లో కూడా ఈ సినిమాలపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు