శివరాత్రికి 'తమ్ముడు' వస్తున్నాడు.. నితిన్ కొత్త సినిమా పోస్టర్ అదుర్స్

నితిన్ 'తమ్ముడు' సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. '2025 మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ వదిలారు. పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకోగా, వెనకాల కొంతమంది అతన్ని తరుముతున్నారు.

New Update
sfas

టాలీవుడ్ హీరో నితిన్ రీసెంట్ గా 'ఎక్స్ట్రాడినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా షూటింగ్స్ కూడా దాదాపు చివరి దశకు వచ్చేసాయి.

'వకీల్ సాబ్' మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'తమ్ముడు ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. '2025 మహా శివరాత్రి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ వదిలారు. 

Also Read : ఎట్టకేలకు బయటికొచ్చిన హర్షసాయి.. కేసుపై ఏమన్నాడంటే!?

అంచనాలు పెంచేలా పోస్టర్..

పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకొని చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకొని, వెనకాల కొంతమంది తరుముతుంటే పరిగెడుతున్నట్టు ఉంది. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటి మెంట్ తో రాబోతున్న ఈ చిత్రంలో  నితిన్ కు అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుంది.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

New Update
deeika

deeika

 


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌ ఇటీవల కశ్మీర్‌ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్‌ స్టాలో పంచుకున్నారు.

కశ్మీర్‌ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్‌ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్‌ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్‌ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు. 

మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్‌ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.

ఈ పర్యటన పై వ్లాగ్‌ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్‌ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.  పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు.   వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు