పెళ్ళికి ముందు IFFI 2024 వేడుకలో అక్కినేని కపుల్స్

55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2024) వేడుక గోవా వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య తన కాబోయే భార్య శోభితతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
naga Chaitanya- sobhita

naga Chaitanya- sobhita

IFFI 2024:  55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ఉత్సవాలు ఈ నెల నవంబర్ 20 నుంచి 28వరకు గోవా వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు సందడి చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య తన కాబోయే భార్య శోభిత దూళిపాళ్ళతో కలిసి రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. శోభిత క్లాసిక్ ఇండియన్ వస్త్రాలంకారణలో కనిపించగా.. చైతన్య గ్రే షూట్ లో ధరించారు. వీరితో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, అమల కూడా IFFI2024  ఉత్సవానికి హాజరయ్యారు. 

Also Read : కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య

బాలీవుడ్ సెలెబ్రెటీలు  

బాలీవుడ్ సెలెబ్రెటీలు సన్యా మల్హోత్రా, భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, బొమన్ ఇరానీ, రణదీప్ హుడా, సన్నీ కౌశల్, ప్రసూన్ జోష్రా, సుధీర్ జోష్రా, రకుల్ తదితరులు IFFI 2024 ఉత్సవంలో సందడి చేశారు. 

ఇది ఇలా ఉంటే.. చైతన్య, శోభిత ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే నెల డిసెంబర్ 4న  వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్థూడియోస్ లో తెలుగు సాంప్రదాయాల ప్రకారం  వీరి పెళ్లి జరగనుంది. తాజాగా వీరి పెళ్లి కార్డు కూడా నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7 2025 విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ సూపర్ హిట్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో నాగచైతన్య జంటగా సాయి పల్లవి నటిస్తోంది. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment