Baahubali The Eternal War 3D: గ్లోబల్ స్టేజ్‌పై "బాహుబలి ఆత్మ" కథ.. రాజమౌళి మరో సంచలనం..!

Baahubali The Eternal War 3D యానిమేషన్ చిత్రం Annecy International Animation Festival 2026లో ఎంపికై గ్లోబల్ గుర్తింపు పొందింది. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాతి కథతో రూపొందుతున్న ఈ సినిమాలు ప్రభాస్, రమ్య కృష్ణ వాయిస్ ఇస్తున్నారు.

New Update
Baahubali The Eternal War 3D

Baahubali The Eternal War 3D

Baahubali The Eternal War 3D: టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు S. S. Rajamouli ‘బాహుబలి’ కథను మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ‘బాహుబలి: ది ఎపిక్’ రూపంలో కథను కొత్తగా చూపించిన మేకర్స్, ఇప్పుడు Baahubali The Eternal War అనే 3D యానిమేషన్ సినిమా ద్వారా మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే పెద్ద గుర్తింపు పొందింది. ఫ్రాన్స్‌లో జరిగే Annecy International Animation Festival 2026లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగానికి అధికారికంగా ఎంపికైంది. యానిమేషన్ రంగంలో ఇది చాలా ప్రెస్టీజియస్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందింది. దీని ద్వారా ప్రపంచస్థాయి విమర్శకులు ఈ సినిమా విజువల్స్‌ను మొదటిసారి చూడబోతున్నారు.

ఈ సినిమా కథ గత బాహుబలి సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత జరిగే సంఘటనలను ఇందులో చూపిస్తున్నారు. అతను దేవతలు (దేవాస్), రాక్షసులు (అసురాస్) మధ్య జరిగే యుద్ధంలోకి వెళ్లే కథగా ఇది సాగుతుంది. మొత్తం 14 విభిన్న లోకాలలో ఈ కథ జరుగుతుంది.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ Prabhas, రమ్య కృష్ణ Ramya Krishna తమ పాత్రలకు మళ్లీ వాయిస్ ఇస్తున్నారు. సంగీతాన్ని కీరవాణి M. M. Keeravani అందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం ఇషాన్ శుక్లా Ishan Shukla వహిస్తున్నారు.

Arka Media Works నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలు. అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో ఈ సినిమా రూపొందుతోంది. ఇది భారతదేశంలో అత్యంత భారీ యానిమేషన్ సినిమాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు