Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు

చారిత్రాత్మక ఘట్టానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 మిషన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.

New Update
Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు

Chandrayaan-3 Landing in few more hours: 30 కిలో మీటర్ల ఎత్తునుంచి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ మాడ్యుల్ పరిస్థితులను పరిశీలించి అన్ని పరిస్థితులు అనుకూలంగా వుంటే ఈ రోజ విక్రమ్ ల్యాండ్ అవుతుందన్నారు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ల్యాండింగ్ ను ఈ నెల 27కు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు

చంద్రయాన్ విజయవంతం కావాలని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక మైన పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ అద్బుతమైన క్షణాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఇప్పటికే భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ లాంటి ప్రముఖు ఇప్పటికే వెల్లడించారు. చంద్రయాన్-3 లైవ్ టెలికాస్ట్ ను తమ దేశంలో కూడా చేయాలని పాక్ మాజీ మంత్రులు కూడా అంటున్నారు.

తిరుపతిలో..

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాడార్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేయాలని శ్రీవారి పాదాల చెంత విద్యార్థులు పూజలు చేశారు.

భారత్ గర్వించదగ్గ ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ సాయంత్రం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని, ఇస్త్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పారు.

ఏలూరు జిల్లాలో ..

జంగారెడ్డిగూడెం లో విద్యా వికాస్ ఆవరణలో చంద్రయాన్ విజయవంతం కావాలంటూ వినూత్న కార్యక్రమం.

చంద్రయాన్ 3 ఆకారంలో విద్యార్థులు ఏర్పడి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఉంగుటూరు లో 

భీమడోలులో చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ భీమడోలు మానసా పాఠశాల విద్యార్థులు 30అడుగుల రాకెట్ నమూనాతో ర్యాలీఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 నేడు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ అవనుందని, మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా చాటనుందని భీమడోలు మనసా పాఠశాల కరస్పాండెంట్ యలమర్తి రవికుమార్ ఆకాంక్షించారు.
బుధవారం భీమడోలు గాంధీబొమ్మ సెంటర్ కూడలిలో మానసా పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది చంద్రయాన్-3 పై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ 30అడుగుల చంద్రయాన్ రాకెట్ నమూనా ఏర్పాటుచేసి రాకెట్ ప్రయోగ దశలను, ప్రయోగ అవశ్యకతను పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు కరస్పాండెంట్ రవికుమార్ వివరించారు. నేడు చంద్రయాన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన తొలి మిషన్ కానుందని దాదాపు 40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణం దాదాపు పూర్తయిందని ఇస్రో కీర్తి మరింత పెరగనుందని అన్నీ అనుకున్నట్టు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ తో చంద్రయాన్ 3 విజయవంతం అవుతుందని, ఈ ప్రయోగం దేశానికి గర్వకారణం, భావి పౌరులకు స్ఫూర్తిదాయకం అని రవికుమార్ ఆకాంక్షించారు.. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు

విజయవాడలో...

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకొంటున్న యావత్ భారతావని..

చంద్రయాన్ 3 వీక్షణ కోసం అన్ని స్కూల్స్ లో ప్రత్యేక ఎర్పాట్లు..

అన్ని ప్రభుత్వ, ప్రవేట్ సంస్థల్లో చంద్రయాన్ 3 లైవ్ ప్రోగ్రాం..

చివరి 17 నిమిషాలు ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పిన ఇస్రో..

ప్రభుత్వం పాఠశాలలో సాయంత్రం 7 గంటల వరకు వుండనున్న విద్యార్థులు

డిజిటల్ క్లాస్ రూమ్ లలో ప్రత్యక్ష ప్రసారాలకు యర్పాట్లు..

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ర్యాలీ లు చేస్తున్న స్కూల్ విద్యార్థులు

వరంగల్ జిల్లాలో...
చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతం అవ్వాలని శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భారత శాస్త్రవేత్తలు మరోసారి సత్తా ఏమిటో తెలిపారు. గత నెల రోజుల క్రితం అంతరిక్ష పరిశోధన నిమిత్తం చంద్ర పరిశోధనలు చేయడానికి చంద్రయన్ లోకి పంపించిన చంద్రయన్ ఈ రోజున సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల కు చేరుకుంది అని చెప్పారు ఈ ఘనత భారత శాస్త్రవేత్తల ది అని కొనియాడారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 

ఏలేశ్వరం నరేన్ మోడల్ స్కూల్ పిల్లలు, టీచర్స్ చంద్రయాన్ 3 సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు
ఆల్ ది బెస్ట్ ఇస్రో అని నినాదాలు..

విక్రం లాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్లకు సాంకేతికంగా అన్ని సక్రమంగా జరగాలని శుభాకాంక్షలు తెలిపిన స్కూల్ పిల్లలపిల్లల..

ఇస్రో కి ఆల్ ది బెస్ట్ అంటూ నినాదాలు..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా సాయం

ల్యాండర్ మాడ్యూల్ తో కమ్యూనికేట్ చేయడంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), నాసాలు సహయాన్ని అందించనున్నాయి. చంద్రయాన్-3పై ఇందిరాగాంధీ ప్లానిటోరియంలో వర్క్ షాపు నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి నుంచి వర్చువల్ గా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు