Chandrababu: మాజీ ఐఏఎస్ పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి..!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి అంటూ చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

New Update
Chandrababu: బీ కేర్ ఫుల్.. టీడీపీ క్యాడర్ కు చంద్రబాబు హెచ్చరిక..!

AP EX CM Chandrababu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ ట్వీట్ చేశారు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్ కు తాను ఇబ్బంది పడ్డానన్నారు రమేష్. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉందంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: ఉత్తరాంధ్రలో ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేస్తోంది..!

అయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి అంటూ చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇళ్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు