Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు AP: కొడాలి నానిపై కేసు నమోదైంది. నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుత తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై గుడివాడ పొలిసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వీరు కారణమైయ్యారని ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. By V.J Reddy 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని షాక్ తగిలింది. కొడాలి నానిపై కేసు నమోదు అయింది. కొడాలి నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై గుడివాడ పొలిసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలినాని కారణమయ్యారంటూ గుడివాడలో రెండో పట్టణ పీఎస్లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని తెలిపాడు. #kodali-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి