Breaking: సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీలో రికార్డైన రేణుశ్రీ దూకుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. By Jyoshna Sappogula 05 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి GITAM University B.tech Student Suicide: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనంలోని ఐదో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేసి ప్రాణాలు తీసుకుంది. గీతం యూనివర్సిటీలో ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీగా (Renu Sri) గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. Also Read: ‘నన్ను చంపాలని చూస్తున్నారు’..కేఏ పాల్ సంచలన ఆడియో..! ర్యాగింగ్ జరిగిందా? కాలేజీలో విద్యార్థులంతా ఉండగానే ఈ ఘటన జరిగింది. రేణుశ్రీ మృతి చెందడంపై స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. సీసీ టీవీలో రికార్డైన రేణుశ్రీ దూకుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అసలు రేణు శ్రీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలో ఏమైనా ర్యాగింగ్ జరిగిందా? లేదంటే లవ్ లో ఫెయిల్ అయి డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుందా? లేదంటే కాలేజ్ లో యాజమాన్యం ప్రెజర్ పెట్టడం వల్ల సూసైడ్ చేసుకుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Also Read: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో) ఆత్మహత్యపై దర్యాప్తు రేణుశ్రీ మృతిపై బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుశ్రీ ఎందుకు ఇలా చేసిందో తెలియక ఆవేదన చెందుతున్నారు . సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. యువతి ఫోన్ ఆధారంగా నిజనిజాలు తేల్చనున్నారు. #sangareddy-district #gitam-university #btech-first-year-student-sucide సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి