Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్‌మెంట్.. బొత్స సంచలన వ్యాఖ్యలు

AP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ అని... డబ్బు ఎవరిస్తే వారికి డబ్బా కొడతాడని చురకలు అంటించారు.

New Update
Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్‌మెంట్.. బొత్స సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanarayana: ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ అని చురకలు అంటించారు. 2019 లో భ్రమలో ఉండి ఆయన్ని తెచ్చుకున్నాం ... ఆయన కమర్షియల్ అని తరవాత తెలిసిందని పేర్కొన్నారు. జిమ్మిక్కులు, చిట్కాలు ఒకసారి మాత్రమే పని చేస్తాయి.. జగన్ కి కావాల్సింది జిమ్మక్కులు కాదు అని అన్నారు.

ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్‌మెంట్ అని ఫైర్ అయ్యారు. రెండవ సారి నమ్మడానికి లేదని విమర్శించారు. క్యాష్ ఎవరు ఇస్తే వాళ్ళ తరపున ప్రశాంత్ మాట్లాడతాడని ఫైర్ అయ్యారు. "ఐప్యాక్ టీమ్ సేవలు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నాం.. మా పార్టీ అధ్యక్షుడు మాకు సుప్రీం.. వైసీపీ పార్టీ శాశ్వతం... అధ్యక్షుడు జగన్ శాశ్వతం.. నాయకులు, కార్యకర్తలు శాశ్వతం... మిగతావన్నీ తాత్కాలికమే" అని బొత్స పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment