BJP: సస్పెన్షన్ వేటు తప్పదు.. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!

బీజేపీలో ఉంటూ కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్. సోషల్ మీడియాలో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సస్పెన్షన్ వేటు తప్పదన్నారు.

New Update
BJP: సస్పెన్షన్ వేటు తప్పదు.. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!

Vizianagaram: పార్వతీపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో ఉంటూ కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు.

Also Read: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్‌ తల్లి లక్ష్మి లేఖ

ఇప్పటికే ఇద్దరు మాజీ శాసన సభ్యులను బీజేపీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కూటమిలో ఉంటూ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన వారిపై, సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..!

సోషల్ మీడియాలో జిల్లా పార్టీపైన, జిల్లా అధ్యక్షుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై రేపు సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలని.. పార్టీ ఆదేశాల అనుగుణంగా పనిచేయాలని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు