Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పులిచెర్ల ZPTC పదవితోపాటు.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

New Update
Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ

Peddireddy Ramachandra Reddy: వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో తన అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల పుంగనూరు మున్సిపల్ చైర్మన్, 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిన ఘటన మరువకముందే మరో ప్రధాన అనుచరుడు మురళీధర్‌ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పులిచెర్ల ZPTC మురళీధర్‌ పదవితోపాటు.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్‌ కూడా రాజీనామా చేశారు. పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్‌ కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు మరో నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సర్పంచులు రాజీనామా చేశారు. ZP సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు రాజీనామాలు అందించారు. నేతల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. కేడర్ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఆ రోజును ‘సంవిధాన్ హత్యా దివస్’గా!

Advertisment
Advertisment
తాజా కథనాలు