Mamata Banerjee: సీఎం మమతపై గవర్నర్ పరువు నష్టం దావా! పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ షాక్ ఇచ్చారు. ఆమెపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. మహిళలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు భయపడుతున్నారని మమత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. By V.J Reddy 29 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ షాక్ ఇచ్చారు. ఆమెపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. మహిళలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు భయపడుతున్నారని మమత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సీఎం మమతతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు నాయకులపై ఆయన పరువు నష్ట దావా వేశారు. కాగా ఈ నెల 27న సచివాలయంలో అధికారుల సమావేశంలో మమత మాట్లాడుతూ... కొందరు మహిళలు తనను కలిశారని.. రాజ్ భవన్ కు వెళ్లేందుకు వారికి భయం కలుగుతోందంటూ తనతో చెప్పారని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ప్రజాప్రతినిధులు దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేయకూడదని మమతపై మండిపడ్డారు. గవర్నర్ తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించా కంటూ రాజ్ భవన్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. #mamata-banerjee సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి