Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే..

బంగ్లాదేశ్ లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో భారత్ వచ్చిన ప్రధాని షేక్ హసీనా విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అయితే, షేక్ హసీనా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే..

Bangladesh Crisis:  బంగ్లాదేశ్‌లో హింసాకాండ మధ్య భారత్‌కు చేరుకున్న షేక్ హసీనా సైనిక విమానం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం బయలుదేరింది. విమానం ఎక్కడికి వెళ్లిందన్న సమాచారం లేదు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా సోమవారం (ఆగస్టు 5) భారత్‌కు చేరుకున్నారు. ఒకరోజు తరువాత ఆమె విమానంలో భారత్ నుంచి వెళ్లిపోయారని మొదట వార్తలు వచ్చాయి. . ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్ళవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  అయితే, ఆ విమానంలో షేక్ హసీనా లేరని.. ఆమె వెంట వచ్చిన బాంగ్లాదేశ్ మిలటరీ అధికారులు ఏడుగురు తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారని ANI తెలిపింది. 

అసలేం జరిగింది.. 

Bangladesh Crisis:  హసీనాకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలో సోమవారం చాలా హింస జరిగింది. దీని తర్వాత హసీనా ఢాకా నుంచి అగర్తల మీదుగా భారత్‌కు చేరుకుంది. హిండన్ ఎయిర్‌బేస్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సుమారు గంటపాటు ఆమెతో మాట్లాడారు.

Bangladesh Crisis:  ఇక మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నారు. 

బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు సంబంధించిన అప్ డేట్స్.. 

  • జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియాను విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆదేశించారు. 2018లో అవినీతికి సంబంధించిన కేసులో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
  • ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. విధ్వంసం, దహనానికి పాల్పడ్డారు.
  • రాజధాని ఢాకాలో 4 లక్షల మంది వీధుల్లోకి వచ్చి స్థలాలను ధ్వంసం చేశారు.
  • సోమవారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. ఆందోళనకారులు 2 రహదారులను ఆక్రమించారు. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే.
  • భారతదేశంలో, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మిజోరాంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో BSF హెచ్చరికను పెంచింది.
  • దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో బంగ్లాదేశ్ ఆర్మీ సమావేశం నిర్వహించింది. 18 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
  • బంగ్లాదేశ్ వెళ్లే రైళ్లన్నింటినీ భారత్ రద్దు చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ఢాకాకు అన్ని విమానాలను రద్దు చేశాయి.
  • విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని ఆయనకు ఒక సమాచారం అందించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విదేశాంగ మంత్రిని కలిశారు.
  • ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బంగ్లా పరిణామాలను విదేశాంగ మంత్రి జై శంకర్ అఖిల పక్ష నేతలకు వివరించారు. బంగ్లాదేశ్ విషయంలో పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రతిపక్ష నాయకులు చెప్పారు.

Also Read : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment