Krishna Mohan Reddy: కేసీఆర్కు మరో ఝలక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే? TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి తిరిగి బీఆర్ఎస్లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు. ఈరోజు ఆయన నివాసానికి మంత్రి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లారు. కాగా ఆయన మరోసారి కాంగ్రెస్లో చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 01 Aug 2024 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Bandla Krishna Mohan Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కొద్ది రోజుల్లోనే తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇష్యూపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణ మోహన్రెడ్డి యూటర్న్కు కారణమేంటి? తెలుసుకోవాలని మంత్రి జూపల్లితో రాయబారం పంపారు. కృష్ణమోహన్రెడ్డి ఇంటికి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లారు. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మార్పు కారణాలపై చర్చ నెలకొంది. బండ్ల కృష్ణమోహన్రెడ్డి జంప్ అవడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారనే సంకేతాలు పంపారు. వెళ్లిపోయిన బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కూడా మళ్లీ లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బండ్ల ఎలాటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read : రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన #bandla-krishna-mohan-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి