author image

BalaMurali Krishna

By BalaMurali Krishna

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుమతి కోరుతూ తెలంగాణలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించిన అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

By BalaMurali Krishna

తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

By BalaMurali Krishna

దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు మహారాష్ట్ర.. ఎక్కడ చూసినా బలహీనవర్గాలపై అవమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నలుగురు దళితులను చెట్టుకుని వేలాడదీసి ఘోరం కొట్టిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.

By BalaMurali Krishna

మొన్న ఢిల్లీలో శ్రద్దా వాకర్.. నిన్న ముంబయిలో సరస్వతి వైద్య.. నేడు బెంగళూరులో మరో అమ్మాయి. అసలేం జరుగుతోంది.. లివింగ్ టుగెదర్ పేరుతో కోరిక తీర్చుకోవడం.. ఆపై చంపేయడం. రోజురోజుకు ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి.

By BalaMurali Krishna

రమణ దీక్షితులు గుర్తున్నారా? గత టీడీపీ ప్రభుత్వంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలతో హల్‌చల్ చేసిన వ్యక్తి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుల పదవి పోగొట్టుకున్న ఆయన.. అప్పటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆయన తీరు మాత్రం ఎప్పుడూ వివాదస్పదంగానే ఉండేది. తాజాగా మరోసారి రమణ దీక్షితులు వార్తల్లోకి వచ్చారు.

By BalaMurali Krishna

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ విమానంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు ప్రయాణిస్తున్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించారు.

By BalaMurali Krishna

69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అల్లు అర్జున్‌ని కలిసి అభినందించారు.

By BalaMurali Krishna

ఏపీలో ఓట్ల గల్లంతు రాజకీయం ఢిల్లీ చేరుకుంది. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను వైసీపీ తొలగిస్తుందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. ఓట్లు గల్లంతు చేసే నీచ రాజకీయం టీడీపీదే అంటూ వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు.

By BalaMurali Krishna

చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన ఇస్రో ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనుంది. ఈ సోలార్ మిషన్ చేపట్టేందుకు తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసింది.

By BalaMurali Krishna

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటరత్న విశ్వవిఖ్యాత దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.100 స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి గుర్తుగా ఈ స్మారక నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. NTR commemorative coin

Advertisment
తాజా కథనాలు