Attack on TDP meeting: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ సభపై రాళ్లతో దాడి

టీడీపీ కార్యక్రమంపై ఆగంతకుల రాళ్లదాడితో పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం రాత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై విచక్షణా రహితంగా రాళ్లు రువ్వడంతో ఇద్దరు గాయపడ్డారు.

New Update
Attack on TDP meeting: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ సభపై రాళ్లతో దాడి

Attack on TDP meeting: టీడీపీ కార్యక్రమంపై ఆగంతకుల రాళ్లదాడితో పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ముప్పా ళ్ల మండలం తొండపి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఊర్లో టీడీపీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీలో పలువురి చేరిక సందర్భంగా ఆదివారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna LaxmiNarayana) ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అయితే, ఒక్కసారిగా కొందరు దుండగులు రెచ్చిపోయి రాళ్లతో దాడికి దిగారు.

ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

లైట్లు ఆర్పేసి బిల్డింగుల మీది నుంచి రాళ్లు విసిరారు. ఆగంతకుల దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడి నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అటు వైపు వెళ్లకుండా వెనక్కి వచ్చి గ్రామంలోనే ఉండిపోయారు. విషయం తెలిసి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

ఇది కూడా చదవండి: విషాదం.. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి..

అయితే తమపై రాళ్ల దాడిని నిలువరించలేకపోయారంటూ పోలీసులపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నాయకులే తమపై రాళ్లతో దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార పార్టీ నాయకులు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడికి దిగారని విమర్శిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మరో ప్రవచనకర్త వీడియోను వైరల్ చేస్తున్నారు.

New Update
Anna Lezhneva

Anna Lezhneva

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌ లో అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే.మార్క్‌ ఆ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో మార్క్‌ ని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత రోజే..పవన్‌ సతీమణి అన్నా లెజోనావా తిరుమలకు వెళ్లారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

publive-image

అక్కడ ఆమె డిక్లరేషన్‌ ఫామ్‌ పై సంతకాలు చేసి..స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ఆమెనే అన్నప్రసాదాలను వడ్డించి,వారితోనే కలిసి కూర్చుని భోజనం చేశారు. అంతేకాకుండా మార్క్‌ పేరు మీద అన్న ప్రసాదాలకు విరాళాలు కూడా అందించారు.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

అన్నా భారతీయ స్త్రీ కాకపోయినప్పటికీ ఆమె స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం, సేవచేయడం వంటివి చేయడంతో జనసేన అభిమానులు,పవన్‌ అభిమానులు ఆవీడియోలను సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ చేస్తున్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి మీద, దేవుని మీద ఉన్న భక్తిని కొనియాడుతున్నారు.

కానీ ఈ క్రమంలో తెరమీదకు మరో అంశం చర్చకు వచ్చింది.ఆమె తలానీలాలు సమర్పించడం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.

నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరి కొందరు ఆధ్యాత్మిక వేత్తలు. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కి చెందిన ఓ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు మూడు కత్తెరలు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువులైన మహిళలు అస్సలు ఆ పని చేయకూడదంటున్నారు.

గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. మొక్కులు చెల్లించడం, జుట్టు ఇచ్చేయడం పరిపాటిగా మారిందని..దీనిని ఓవర్ యాక్షన్ అంటారంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని, కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమౌతాయని ఆ వీడియోలో ఉంది.

ఇదిలా ఉంటే...మరో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తల నీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Also Read: USA-China: అమెరికా, చైనా టారిఫ్‌ వార్‌లో బిగ్‌ట్విస్ట్‌.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !

ap | tirumala | Anna Lezhneva In Tirupat | Anna Lezhneva Offering Hair at Tirumal | Pawan Kalyan Wife Anna Lezhneva | Pawan Kalyan Wife Anna Lezhnava offerd Hair | latest-news

Advertisment
Advertisment
Advertisment