Minister Kollu Ravindra: ప్రజలకు జగన్ నుంచి రక్షణ కావాలని: మంత్రి కొల్లు రవీంద్ర AP: తనకు రక్షణ కావాలని జగన్ అడుగుతున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాస్తవానికి జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చే సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకు ఇవ్వరని.. జగన్ ఇది తెలుసుకోవాలని అన్నారు. By V.J Reddy 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Minister Kollu Ravindra: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు మంత్రి కొల్లు రవీంద్ర. తన భద్రత పెంచాలని జగన్ (YS Jagan) అంటున్నారని.. జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహాలో సెక్యూరిటీ ఉండదని చెప్పారు. సీఎం, పీఎం తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు (Chandrababu) చేసే అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో తట్టుకోలేక పోతుందని అన్నారు. రెడ్ బుక్ (Red Book) పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని చెప్పారు. పాపాలు చేసిన వారిని దోషులుగా నిలబెట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తప్పులు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. Also Read: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్కు బిగ్ షాక్.. కేసు నమోదు! #chandrababu-naidu #ys-jagan #kollu-ravindra సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి