CM Jagan: ఆ 50 మందికి షాక్.. రేపు సీఎం జగన్ కీలక ప్రకటన?

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ లిస్టులో 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు వైసీపీ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్.

New Update
YCP: ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!

YCP MLA Final List : మరి కొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సీఎం జగన్(CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేల్లో ఎన్నికల్లో విజయం సాధించలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ కట్ చేస్తున్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొత్త వారికి టికెట్ ఇచ్చే విషయంపై సీఎం జగన్ అండ్ టీమ్ కసరత్తు చేస్తోంది. గత కొన్ని రోజులుగా తాడేపల్లి సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ వారితో టికెట్ గురించి చర్చిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ రాదని భావించిన కొందరు సిట్టింగ్ లు పార్టీ ఫిరాయించే పనిలో పడ్డారు. ప్రతిపక్ష పార్టీలతో రహస్య సమావేశాలు పెడుతున్నారనే టాక్ అక్కడ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది.

ALSO READ: సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ

50 మంది సిట్టింగ్ లకు జగన్ షాక్..?

ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్న సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేయనున్నారు. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. ఇవాళ లేదా రేపు వైసీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 51 మందితో వైసీపీ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. జనవరి 1 నుంచి ప్రజల్లోకి కొత్త అభ్యర్థులు వెళ్లేలా జగన్ కార్యాచరణ రూపొందించారు. 175 స్థానాల్లో ఇప్పటికే 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది జిల్లాల్లో ఇప్పటికే కసరత్తు పూర్తి అయిందని ఆ పార్టీలో ప్రచారం జోరందుకుంది. నెల్లూరు, కృష్ణా, విశాఖల ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులపై సీఎం జగన్ నేతలతో చర్చలు జరపనున్నారు. ఈరోజు లేదా రేపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment