MLA Raja singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు..! గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా అనుమతి లేకుండా శోభయాత్ర నిర్వహించడంతో రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపిసి 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 22 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLA Raja singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుక్కున్నారు. ఆయన పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి అనుమతి లేకుండా శ్రీరాముడి శోభయాత్ర నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపధ్యంలో పర్మిషన్ లేకుండా రాజాసింగ్ శోభయాత్ర నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్నారు. Also Read: అనపర్తిలో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శోభయాత్ర ర్యాలీ సందర్భంగా పలు చోట్లు ఆపి బాణసంచా కాలుస్తూ.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆయన ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని IPC 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. #bjp-mla-raja-singh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి