Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం.. మహిళపై అత్యాచారం.. మర్డర్!

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది బాధితురాలి ముఖం గుర్తు పట్టకుండా కిరాతుకంగా మర్డర్ చేశారు. అయితే ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం.. మహిళపై అత్యాచారం.. మర్డర్!

Hyderabad: హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది బాధితురాలి ముఖం గుర్తు పట్టకుండా కిరాతుకంగా మర్డర్ చేశారు. అయితే ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ డెడ్ బాడీ ఉన్నట్టుగా స్థానికులు గుర్తించారు. దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళపై అత్యాచారం చేసి తరువాత బండరాయితో మోది దుండగులు కిరాతుకంగా చంపినట్లు ఆనవాళ్ళు గుర్తించారు.

అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. కాగా, మృతురాలిని పోలీసులు గుర్తించారు. గౌలిదొడ్డిలోని కేశవ నగర్ కు చెందిన మహిళగా గుర్తించడం జరిగింది. అండర్ కన్ స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో మృతురాలు వేస్ట్ మెటీరియల్ ను తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే మృతురాలు ఈ నెల 25 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఈ ఘటనపై ఇంకా డీటైల్స్ తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మళ్లీ ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ తో పాటు నగరశివారు ప్రాంతాల్లో పెరుగుతుండడంతో ఆందోళన కల్గుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment