Vizag: విశాఖలో హైటెన్షన్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు అరెస్ట్! విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేను కార్మికులు, ఉద్యోగులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్కు భారీగా కార్మికులు రాస్తారోకో చేశారు. By V.J Reddy 10 Sep 2024 in వైజాగ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vizag: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేను కార్మికులు, ఉద్యోగులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్కు భారీగా కార్మికులు రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించి కార్మికుల నిరసన చేపట్టారు. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తన్నారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీసు బందోబస్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి