Vijayashanthi: పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్పై- కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి - ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ-- అన్నా.. హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు.- అగ్నిప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు..-- కృతజ్ఞతగా శ్రీవారికి తల నీలాలు ఇచ్చారు. అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు- అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 15, 2025
అత్యంత అసమంజసం..
'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.
హరహర మహాదేవ్. జై తెలంగాణ' అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
మార్క్ శంకర్పై కూడా ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్ శంకర్పై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
telugu-news | today telugu news
ధూళిపాళ్ల మూడు దశాబ్దాల ప్రజా ప్రస్థానం సభ సక్సెస్
Dhulipalla Narendra: మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ధూళిపాళ్ల నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా పొన్నూరులో ధూళిపాళ్ల మూడు దశాబ్దాల ప్రజా ప్రస్థానం సభ నిర్వహించారు. ఈ సభలో ధూళిపాళ్ల మాట్లాడుతూ.. రెవిన్యూ శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన తన తండ్రి దూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఓటమి పాలయిన సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు మొదలుకుని, తన తండ్రి అకాల మరణం తరువాత టిక్కెట్టు కోసం చేసిన పోరాటాలు, కక్ష కట్టి పొన్నూరు నియోజకవర్గాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు వైఎస్సార్ చేసిన ప్రయత్నాల వరకూ వివరించి చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను గురించి చెబుతూ.. గత వైసీపీ పాలనలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం గురించి ప్రస్తావించారు. తాను ఆ సమయంలో మానసికంగా కాస్త నలిగిపోయినా.. ధైర్యం కోల్పోలేదని చెప్పారు.
మాఫియాలకు వ్యతిరేకంగా...
ప్రతిపక్షంలో ఉండగా రేషన్, గ్రావెల్ మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తాను, ఈవేళ అధికారంలోకి వచ్చాక అదే మాఫియాను అనుమతిస్తే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని పేర్కొన్న నరేంద్ర, తన తండ్రి నుండి వారసత్వంగా అంది పుచ్చుకున్న నైతిక , వ్యక్తిగత విలువలకు కట్టుబడివున్న తనను సన్నిహితులు కొందరు పాతకాలం మనిషిగా గేలిచేసినా, తను మాత్రం జీవితాంతం ఆ విలువలకే కట్టుబడి ఉంటానని చెప్పటం ద్వారా నరేంద్ర మరోమారు తన నైజాన్ని విస్పష్టంగా ప్రకటించారు.
అలాగే, తనకు మంత్రి పదవి రాలేదనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని నరేంద్ర స్పష్టంగా వివరించారు. మొత్తంగా చూసుకుంటే ధూళిపాళ నరేంద్ర కుమార్ ఈ సభ ద్వారా తన అంతరంగాన్ని అభిమానుల ముందు ఆవిస్కహరించారని చెప్పుకోవచ్చు.
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ. Short News | Latest News In Telugu | తిరుపతి | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!
కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్
అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా రానుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ స్వయంగా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Vijayawada: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?
నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!
AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్